అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో మంగళవారం ఉదయం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.