రాయదుర్గం - కళ్యాణదుర్గం రూటు నేషనల్ హైవే రోడ్లు ఆవులదట్ల, మారంపల్లి, బొమ్మక్కపల్లి బస్టాండ్ వద్ద మెయిన్ రోడ్డు పై రైతులు మొక్కజొన్న పంట ఆరవేయడం వల్ల వచ్చి వెళ్లే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాటిని వెంటనే తొలగించాలని సిఐ జయనాయక్ ఆదేశించారు. శుక్రవారం అక్కడి రైతులతో మాట్లాడి ప్రమాదాల నివారణకై అవగాహన కల్పించారు. మరోసారి రోడ్డు పై వేసిన యెడల తగు చర్యలు తీసుకుంటామని అక్కడి రైతులు అందరికీ హెచ్చరించారు.