ప్రకాశం జిల్లా కురిచేడు మండలం భోధనంపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పరిసర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పొంగళ్ళు నైవేద్యం సమర్పించి మొక్కలు తీసుకున్నారు. రాత్రి ఐదు విద్యుత్ ప్రభలతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 60 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై శివ తెలిపారు.