అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి 390అర్జీలను ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్వీకరించారు. ఇంఛార్జి జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణరెడ్డి, ఆర్డీఓలు కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు.