అసిఫాబాద్: లైన్ పటార్ గ్రామంలో 40మంది గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కెరమెరి పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం కెరమెరి(M) లైన్ పటార్ గ్రామంలోని 40మంది గిరిజనులకు ASF ఏఎస్పీ చిత్తరంజన్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అత్యల్ప ఉష్ణవతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చలి తీవ్రంగా పెరిగిందన్నారు. గ్రామస్థులు ఇబ్బందులు పడకుండా తమ వంతు బాధ్యతగా దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. ఆయనతో పాటు వాంకిడి సీఐ సత్యనారాయణ, కేరమేరీ ఎస్సై మధుకర్ ఉన్నారు.