అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం ఆకులేడు గ్రామంలో ద్విచక్ర వాహనంలో తన పొలానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఆకులేడు గ్రామానికి చెందిన ఫాతిమా అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.