పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు గిద్దలూరు నియోజకవర్గంలో 869 మందికి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు రూ.7 కోట్ల రూపాయలకు పైగా నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు.