కుందుర్పి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 15వ తేదీ లోపు గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయించాలని కుందుర్పి మండలం వైసీపీ అబ్జర్వర్ తిమ్మరాయుడు నాయకులకు సూచించారు. కుందుర్పి మండల కేంద్రంలో సోమవారం అందుబాటులో ఉన్న నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియామకాలు ఉండాలన్నారు. 2029లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యంగా ఉండాలన్నారు. అందరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు.