పెద్ద పప్పూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో కాలనీవాసుల ఆధ్వర్యంలో సోమవారం యాచకులకు మాంసాహార విందు ఏర్పాటు చేశారు. అశ్వర్థ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన యాచకులకు మాంసాహార విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో అంబేద్కర్ కాలనీవాసులు అశ్వర్థ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఉన్న యాచకులను పెద్దపప్పూరుకు తీసుకెళ్లి మాంసాహార విందు ఇచ్చారు. గత 80 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.