గుర్రంకొండ గ్రామ ప్రజలకు వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి చోరీల నియంత్రణ పై సోమవారం రాత్రి అవగాహన కల్పించారు. గుర్రంకొండ మండలంలో మరియు చుట్టుపక్కల మండలాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇందుకు చాలా వరకు ప్రజల అభద్రతా భావం కారణమని అన్నారు.పోలీసులు పదే పదే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎవరైన శుభకార్యాలకు,బంధువుల ఇళ్లకు,బయట ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే,తెలిసిన వారిని ఎవరో ఒకరిని ఇంటిలో పెట్టి వెళ్ళాలని,లేకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నగలు నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్ళాలని,లేదా వెంట తీసుకుని వెళ్ళాలని తెలుపుతున్నా ప్రజలు పట్టించుకోక పోవడంతో చోరీలు జరుగుతున్నాయి