కొత్తచెరువు సమీపాన ద్విచక్ర వాహనం ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం,ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Nov 16, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు సమీపాన ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ధర్మవరం కు చెందిన రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ధర్మవరం నుండి పుట్టపర్తి చక్ర వాహనంలో వెళ్తుండగా కొత్తచెరువు సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.