అనంతపురం నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన పలువురి పై అన్నదమ్ములు దాడి చేసి గాయపరిచిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అమ్మపై గంగానగర్ కు చెందిన రామకృష్ణ అతని సోదరుడు బాబులు దాడికి పాల్పడినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.