గుత్తి ప్రభుత్వాసుపత్రి లో సోమవారం శ్రీకరం శ్రీరాములు అనే వ్యక్తి తన కుమారుడు శ్రీనివాసులు జ్ఞాపకార్థం గ్రిల్ ఏర్పాటు చేయించారు. సుమారు 15 వేల రూపాయలు వెచ్చించి గ్రిల్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఎల్లప్ప మాట్లాడారు. శ్రీకరం శ్రీరాములు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేల రూపాయలు వెచ్చించి గ్రిల్ ఏర్పాటు చేయించారన్నారు. అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.