నంద్యాల జిల్లా డోన్ జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో జిల్లా స్పెషల్ అధికారి రామాంజనేయులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, భోజనం విద్య గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల యాక్షన్ ప్రణాళిక గురించి విద్యార్థులకు వివరించి, వారిని మోటివేట్ చేశారు. పదో తరగతి పరీక్షలలో అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.