ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏపిఎం వెంకటేశ్వర్ల, డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం పై హెల్త్ సబ్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు టీకాలు వేయించాలని దంతాలు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. రక్తహీనత తదితర విషయాలపై అవగాహన కల్పించారు