వైకాపా కార్యకర్త మృతికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాళులు అర్పించారు.పీలేరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి వాల్మీకిపురం మండలం నాగంవారి పల్లి నందు కురభ సామాజిక వర్గానికి చెందిన కీ.శే. దేపాని సుధాకర్ (38) దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ వైకాపా పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపా పార్టీ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారని, 2024 శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించారని తెలిపారు. వీరి కుటుంబానికి వైకాపా పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.