ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో విషాదం నెలకొన్నది. స్థానికంగా నివాసం ఉంటున్న అంజిరెడ్డి తన ఇంటి వద్ద స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. స్తంభం పైనుంచి కింద పడడంతో పక్కనే ఉన్న గోడ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.