ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం బాల్యవివాహాలపై జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనార్టీ తీరకుండా బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. అంతేకాకుండా వివాహం చేసుకున్న యువకుడు కూడా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా బాలికలకు బాల్యవివాహాలు చేయకుండా అడ్డుకోవాలని అన్నారు. బాల్యవివాహాలు చేయడం వల్ల బాలికలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఓంకార్ తెలిపారు.