విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం కొమరాడ మండలంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్య మని ప్రకటించి, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నానని పత్రికా ప్రకటన ఇవ్వాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.