ముధోల్: బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో కుక్కలు కోతుల బెడద కి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కిసాన్ గల్లి మహిళలు కమిషనర్ కు వినతి
Mudhole, Nirmal | Sep 18, 2025 నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో కుక్కలు కోతుల బెడద కి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గురువారం కిసాన్ గల్లి మహిళలు మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ కి వినతి పత్రం అందించారు. కాలనీలలో తిరగాలంటే ఊర కుక్కల బెడద తో భయంగా ఉందని ఇప్పటికే పలువురికి కుక్కలు కాటేసేయని, కోతులు సైతం ఇండ్లలో చొరబడి వీర విహారం చేస్తున్నాయని కమిషనర్ కి తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ తొందర్లోని తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.