మార్కాపురం జిల్లా తర్లుపాడు పోలీస్ స్టేషన్ ను పొదిలి సీఐ రాజేష్ కుమార్ సందర్శించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం రథోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులకు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రథోత్సవం కట్టుదిట్టంగా ఏర్పాటు చేసేందుకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు