ఖమ్మం అర్బన్: చిట్ ఫండ్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేసిన ఖమ్మం టూటౌన్ పోలీసులు
గత కొంతకాలంగా నగరంలోని ప్రవేటు చిట్స్ నిర్వహిస్తు రెండు కోట్లకు పైగా మోసం చేసి చిట్టి బాధితుల నుండి తప్పించుకొని తిరుగుతున్న చిట్ ఫండ్ డైరెక్టర్లు సంగిశెట్టి కరుణాకర్, మూల ఉమామహేశ్వర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.సుమారు 42 మంది చిట్టి బాధితులకు ఇవ్వవలసిన 2 కోట్ల 17 లక్షల రూపాయలు ఇవ్వకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకొని తిరుగుతున్నారని, ఇటీవల మరిపెడ బంగ్లా కు చెందిన భూక్య శ్రీనివాస్ అనే బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.