కనిగిరి పట్టణంలోని శంఖవరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా. రూ.1.30 కోట్లతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.