నగరంలోని శ్రీకంఠం సర్కిల్, శారద నగర్ , శ్రీనగర్ కాలనీ పార్క్ వద్ద విజిలెన్స్ అధికారులు పాల వ్యాపారుల వద్ద తనిఖీలు
అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు పాల వ్యాపారుల వద్ద తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి, శారద నగర్, శ్రీ శ్రీనగర్ కాలనీ సమీపంలోని నీరు ప్రగతి పార్కు సమీపంలోనూ తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి పాల కల్తీ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో అనంతపురం జిల్లాలో బుధవారం 7:30 గంటల సమయంలో ఉదయం విజిలెన్స్ డి.ఎస్.పి నాగభూషణం, సీఐ జమ్మల్ భాష పాల వ్యాపారులు విక్రయిస్తున్న సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఆయా పాలను శాంపుల్స్ చూశారు. పాలలో కల్తీ ఉందని తెలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పాల వ్యాపారులకు హెచ్చరించారు.