రోడ్డు ప్రమాదాల నివారణకు రాయదుర్గం పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు కు అడ్డంగా పెరిగిన కంపచెట్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా జెసిబి సహాయంతో వాటిని తొలగించారు. రోడ్డు మలుపుల వద్ద పెరిగిన కంపచెట్ల తొలగింపుతో ఎదురుగా వచ్చే వాహనదారులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. పోలీసు చర్యలువ పట్ల వాహనదారులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.