నంద్యాల జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా లక్ష్మీదేవి అరుదైన ఘనత సాధించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారి ఆమెను ఘనంగా అభినందించారు.ఆటో నుంచి లారీ, బస్సు వంటి భారీ వాహనాలు నడిపే స్థాయికి ఎదగడం మహిళలకు గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా మహిళలు రాణించగలరని లక్ష్మీదేవి నిరూపించారని, ఈ విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.