పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనుల వివరాలను రిలయన్స్ సంస్థ ప్రతినిధులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రిలయన్స్ సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు.