ప్రకాశం జిల్లా పాకలలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగంతో పాటు అందరం కృషి చేస్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఆదివారం బీచ్ను సందర్శించిన ఆయన మాట్లాడారు. ఈ ఫెస్టివల్ను పాకల బీచ్లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సమీప గ్రామాల నుంచి భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పలు రకాల పోటీలు ఉంటాయన్నారు.