అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు చేరుకుని అక్కడ నుంచి వినాయక కూడలి వరకూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లలను రక్షిద్దాం అంటూ నినదించారు. కార్యక్రమంలో సిఐ జయనాయక్, ఎస్ఐ సురేష్, పాఠశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.