రాయదుర్గం పట్టణంలో రాణిసత్రం బస్టాండు వద్ద బస్సు ఎక్కుతున్న మహిళ ప్రయాణీకురాలి మెడలో గోల్డ్ చైన్ మాయమైంది. కణేకల్ మండలం ఎర్రగుంటకు చెందిన రేణుకమ్మ దుస్తుల కొనుగోలుకు రాయదుర్గం వచ్చింది. తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు మెడలోని 35 గ్రాముల గోల్డ్ చైన్ కొట్టేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అక్కడికి చేరుకుని సిసి కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.