అనంతపురం నగరంలోని ఆదర్శ నగర్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రమేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.