తాడిపత్రిలోని అతి పురాతనమైన, పవిత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ గోపురాలకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ చంద్రమోహన్ చొరవతో ఆలయ గోపురాలపై ఉన్న శిల్పాలకు మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఆలయ గోపురాలపై ఉన్న శిల్పాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నామని ఆలయ చైర్మన్ చెప్పారు. మహాశివరాత్రి కి మరమ్మతు పనులు పూర్తవుతాయని చెప్పారు.