యాడికి మండలం లక్ష్యం పల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం భార్యాభర్తలు రమేష్-మహేశ్వరి ల మధ్య గొడవ జరిగింది. రమేష్ కోపంతో భార్య మహేశ్వరిపై రాయిని విసిరాడు. ఆ రాయి కాస్త నాలుగేళ్ల బాలుడు రాహుల్ పైపడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తరలించారు. కర్నూల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. నా భర్త రమేష్ రాయితో వేయడం వల్లే కుమారుడు రాహుల్ మృతి చెందాడని మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన సీఐ శ్రీనివాసులు సోమవారం రాత్రి రమేష్ పై కేసు నమోదు చేశారు.