కళ్యాణదుర్గంలో శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బాలికలు, యువతులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కూచిపూడి, భరతనాట్యం చేసి అందరినీ మెప్పించారు. సుమారు మూడు గంటలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.