మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామ సమీపంలో రైలు పట్టాల పక్కన మొద్దులపల్లి యువకుడు శివ మృతదేహం లభ్యమైన విషయం తెలిసినదే. మృతుడి మొండెం మాత్రమే దొరికింది తల దొరకలేదని దీంతో పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సూసైడ్ కేసుగా ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసుకున్నారని తమ కొడుకు మృతి పై పలు అనుమానాలు ఉన్నాయని తండ్రి శ్రీను తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి తమ కొడుకు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.