కళ్యాణదుర్గం కోర్టులో నూతనంగా ఏజీపీగా నియమితులైన పార్థసారథి చౌదరి మంగళవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్థసారథి చౌదరి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యేని కలిసి న్యాయపరమైన సమస్యల గురించి కాసేపు ఇద్దరు చర్చించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పార్థసారథి చౌదరికి సూచించారు.