అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద ద్విచక్ర వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో వెంకటాపురంకు చెందిన లోకేష్ మరియు మోక్షిత్ అనే ఇద్దరికీ గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.