విజయవాడలో ఆందోళన చేపట్టిన అంగన్వాడీ లను అక్రమ అరెస్టులు నిరసిస్తూ రాయదుర్గంలో రోడ్డు పై అంగన్వాడీలు మంగళవారం నిరసన చేపట్టారు. అరగంట రాస్తారోకో చేశారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ నేతలను అరెస్ట్ చేయిఓచిందని నేతలు ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సిఐటియు నేతలు, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.