ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో బాలల వెట్టి చాకిరి నిరోధిక చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటికీ బాలలకు వారి హక్కులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయని కలెక్టర్ అన్నారు. వారికోసం ప్రత్యేకంగా ఒక శాఖనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఎవరైనా బాలల చేత పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పమన్నారు. ఇక అటువంటి బాలలను గుర్తించి చదువుకునే ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు.