అక్రమంగా నిల్వ చేసి ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ లు పట్టుకున్నారు. కౌటాల(M ) గుండాయిపేట గ్రామానికి చెందిన గోయినే శంకర్, గొంగ్లే రాజు ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం దాడిచేసి సోదాలు నిర్వహించగా,10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లభ్యమయ్యాయి. బియ్యం స్వాధీనం చేసుకుని,వారిపై 6A కేసు నమోదు చేశామన్నారు.