అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో నార్పల మండల కేంద్రానికి చెందిన ఓబులేసు అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.