మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో గాయపడ్డారు ఇద్దరు వృద్ధ దంపతులను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి కాలు విరిగినట్లుగా పోలీసులు తెలిపారు.