మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో సరదాగా గడిపారు. విద్యార్థులు బహుమతిగా ఎమ్మెల్యేకి చాక్లెట్లు ఇవ్వగా అందుకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ వారు కూడా చాక్లెట్లు కొనుక్కోవాలంటూ ఎమ్మెల్యే విద్యార్థులకు రూ.500 బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులు వద్దు అని వారించిన లేదు తప్పనిసరిగా చాక్లెట్లు కొనుక్కోవాల్సిందే అని అంటూ వారితో సరదాగా మాట్లాడారు.