కళ్యాణదుర్గంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎమ్మెల్యే సురేంద్రబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలు రూపంలో అందజేశారు. ఈ క్రమంలో కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ తన కు ఇల్లు లేదని, నడవటానికి కూడా వీలు కావడం లేదని విన్నవించింది. ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తానని అంతేకాకుండా ట్రై సైకిల్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పలు సమస్యలను అక్కడకక్కడే పరిష్కారం చేశారు.