అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి పట్టణంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో దాదాకలందర్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.