నంద్యాల జిల్లా బేతంచెర్ల లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బుగ్గన చంద్రారెడ్డి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు ఉదయ్ కిరణ్ రెడ్డి బుధవారం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ఎంతో శ్రమించినా, తమ కష్టానికి గుర్తింపు లభించలేదని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు.