నార్నూర్: కరత్వాడలో ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. చలికాలం దృష్ట్యా నార్నూరు మండలంలోని కరత్వాడ గ్రామంలో పోలీస్ శాఖ తరపున గురువారం ఆదివాసులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని దుప్పట్ల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై జిల్లా పోలీసులకు సహకరించాలన్నారు. యువత మాదకద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలి అని సూచించారు.