మేడ్చల్: తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు గత పదేళ్లలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయా అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ఆమె ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు.