బెజ్జూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని బెజ్జూరు మాజీ జెడ్పిటిసి పాల్వాయి సుధాకర్ రావు అన్నారు. సలుగు పల్లి గ్రామపంచాయతీలో బిజెపి నాయకులతో కలిసి ఇందిరా మహిళలకు సుధాకర్ రావు భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయన్నారు. దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని లబ్ధిదారులు ఎవరు అధైర్యపడవద్దని అన్నారు,