అనంతపురం జిల్లా నార్పల మండలంలోని నడిమి దొడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మవరం పట్టణానికి చెందిన లక్ష్మీ నారాయణ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.